‘కొమురం భీం’ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

Andhragazette - PM Narendra Modi

Andhragazette - PM Narendra Modi

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో తెలంగాణ వీరుడు ‘కొమురం భీం’ (Komaram Bheem) ను కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో దేశ ప్రజలకు స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ.. ఆ కాలంలో బ్రిటీష్‌వారి దోపిడీని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ, హైదరాబాద్‌ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదన్న మోదీ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై, బ్రిటీషర్ల అకృత్యాలపై 20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమించాడని మోదీ చెప్పారు. నిజాం పోలీసు అధికారిని కొమురం భీం చంపడమే కాకుండా, అరెస్ట్‌ కాకుండా తప్పించుకోగలిగారని కీర్తించారు. అసంఖ్యాక ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా ఆదివాసీల మనస్సుల్లో.. కొమురం భీం సుస్థిరస్థానం సంపాదించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొమురం భీం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని కూడా ప్రధాని మోదీ సూచించారు.

నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల

PM Kisan: కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ ప్రారంభంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pradhan Mantri Kisan Samman Nidhi) 21వ విడతను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా దేశంలోని 8.5 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.2,000 అందనున్నాయి. ఈ పథకం డబ్బులు బ్యాంకులో జమకావాలంటే లబ్ధిదారులు e-KYCని పూర్తి చేయాలి. సకాలంలో చెల్లింపులను స్వీకరించడానికి వారి ఆధార్ లింక్ చేయబడిందని నిర్ధారించుకోవాలి. ఈ మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(DBT) రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తుంది. రైతులు తమ ఆధార్ లేదా బ్యాంక్ నంబర్‌ను ఉపయోగించి pmkisan.gov.inలో వారి చెల్లింపు స్థితిని తెలుసుకోవచ్చు.

ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) వ్యవస్థ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. అయితే ఈ డబ్బులను నవంబర్ మొదటి లేదా రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయబడనున్నట్లు సమాచారం.

కాగా, రైతులు e-KYC కోసం పీఎం కిసాన్ పోర్టల్‌కు లింక్ చేయబడిన ఆధార్ మొబైల్ నంబర్‌కు పంపబడిన OTPని టైప్ చేయడం ద్వారా లేదా PMKisan GOI యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఫేస్ రికగ్నైజేషన్ ఉపయోగించి అతని ఆధార్ మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం ద్వారా లబ్ధిదారుడు స్వతంత్రంగా eKYCని ధృవీకరించవచ్చు. ప్రభుత్వం 2023 జూన్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌తో రైతుల కోసం PM-కిసాన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. OTP లేదా వేలిముద్ర లేకుండా తన ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రైతు ఇంట్లో కూర్చొని e-KYC చేయవచ్చు. భారతదేశం అంతటా వ్యవసాయ వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

Also Read: శివ నామస్మరణతో మారుమ్రోగిన ఉమామహేశ్వర స్వామి ఆలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *