లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే !
వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి విషయంలో వాస్తు నియమాలు పాటించాలని చెబతుుంటారు. ఎవరైతే వాస్తు నియమాలను విస్మరిస్తారో, వారు అనేక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నిమాలు ఉల్లంఘించకూడదని చెబుతారు. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించాలి అంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
దీపావళి సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకొని, అందంగా తయారు చేసుకుంటారు. అయితే ఇలా ఇంటిని క్లీన్ చేసే క్రమంలో, ఉప్పు నీటితో మీ ఇల్లుని అందంగా తుడుచుకోవాలి అంట. దీని వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఉప్పు నీటితో ఇంటిని తుడవడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి, ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందంట. ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట.
వాస్తు శాస్త్రం ప్రాకారం దీపావళి రోజున ఇంటిని శుభ్ర చేసిన తర్వాత, ఇంటిలో గంగాజలంలో కుంకుమ, పచ్చిపాలు, పసుపు వేసి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లు కోవాలి అంట. దీని వలన కూడా అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబతున్నారు ఆరోగ్య నిపుణుల. దీని వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, సంపద నిలుస్తుందంట. అంతే కాకుండా అప్పుల బాధలు కూడా తొలిగిపోతాయని చెబతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
చాలా మంది దీపావళి రోజు ఎక్కువగా ఆలయాలకు వెళ్లరు. ఇంటిలోనే పూజ నిర్వహించుకుంటారు. కానీ తప్పకుండా దీపావళి రోజు శివాలయానికి వెళ్లాలంట. దీపావళి రోజున శివాలయానికి వెళ్లి దీపం పెట్టడం వలన కష్టాలు అన్నీ తొలిగిపోయి, జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయంట. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొటుంది, కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు పండితులు.
దీపావళి రోజున ఇంటిని మామిడి ఆకులు, పువ్వులతో అందంగా తయారు చేసుకోవాలంట. దీని వలన ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు నిపుణులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.)
