ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగిపై వేటు

FacebookEmailWhatsAppXTelegram

బెంగళూరు : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్వార్‌ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఈ నెల 12న లింగసుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాం ధరించి.. కర్ర పట్టుకొని రూట్‌ ఊరేగింపులో కవాతు చేస్తున్న దృశ్యాలు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవీణ్‌ కుమార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొనడంతో అతడిపై సస్పెన్షన్‌ వేటు విధించినట్లు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ అరుంధతి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. ప్రవీణ్‌ కుమార్‌ లింగసుగూర్‌ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *